Tue Mar 17 2026 03:17:52 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ ప్రారంభం.. వారందరి ఖాతాల్లోకి?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్నారు. లాక్ డౌన్ సందర్బంగా డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడకూడదని జగన్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్నారు. లాక్ డౌన్ సందర్బంగా డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడకూడదని జగన్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించనున్నారు. లాక్ డౌన్ సందర్బంగా డ్వాక్రా మహిళలు ఇబ్బంది పడకూడదని జగన్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రహిత రుణాలను డ్వాక్రా మహిళలకు అందించనున్నారు. ఇందుకోసం 1400 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ పథకం ద్వారా దాదాపు 8.78 లక్షల స్వయం సహాయక గ్రూపులు లాభపడనున్నాయి. 93 లక్షల మంది డ్వాక్రా గ్రూపు సభ్యులు లబ్ది పొందనున్నారు. ఈ సందర్భంగా జగన్ డ్వాక్రామహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు.
Next Story

