Thu Jan 29 2026 11:15:03 GMT+0000 (Coordinated Universal Time)
ఇక ఏపీలో వేగంగా పరీక్షలు… జగన్ ఆదేశాల మేరకు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను జగన్ పరిశీలించారు. పరిశ్రమల శాఖ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను జగన్ పరిశీలించారు. పరిశ్రమల శాఖ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కరోనా నివారణ చర్యలపై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను జగన్ పరిశీలించారు. పరిశ్రమల శాఖ ఆద్వర్యంలో మెడిటెక్ జోన్ లో వెయ్యి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను తయారు చేశారు. ఒక్కో కిట్ తో ఇరవై మందికి రోజుకు పరీక్షలుచేయవచ్చు. రెండు గంటల్లోనే వీటి ద్వారా ఫలితాలు వస్తాయి. వెయ్యి కిట్లను ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అందుబాటు లోకి తెచ్చింది. పదిరోజుల్లో పదివేల కిట్లు రూపొందించాలని జగన్ ఆదేశిచారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో హాట్ స్పాట్ లను గుర్తించి అక్కడ పటిష్టమైన చర్యలు రూపొందించాలని జగన్ అధికారులను ఆదేశించారు.
Next Story

