Thu Jan 29 2026 08:11:28 GMT+0000 (Coordinated Universal Time)
ఇక వాటిపై దృష్టి పెట్టండి… కఠిన నిర్ణయాలు తీసుకోండి
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. హాట్ స్పాట్ లలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ నమోదయిన వారు ఉన్న చోట కిలోమీటరు వరకూ [more]
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. హాట్ స్పాట్ లలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ నమోదయిన వారు ఉన్న చోట కిలోమీటరు వరకూ [more]

కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. హాట్ స్పాట్ లలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ నమోదయిన వారు ఉన్న చోట కిలోమీటరు వరకూ రాకపోకలను నిషేధించింది. ఆ ప్రాంతంలో ర్యాపిడ్ సర్వేను, టెస్టులను నిర్వహించాలని నిర్ణయించింది. పన్నెండు గంటల్లోనే 14 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రధానంగా హాట్ స్పాట్ లపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగన్ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ను మరింత కఠిన తరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీలో 266 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Next Story

