Sun Mar 15 2026 09:19:09 GMT+0530 (India Standard Time)
జగన్ కు 175 నియోజకవర్గాల నుంచి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు 175 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు లేఖ రాశారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో జగన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు 175 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు లేఖ రాశారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో జగన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు 175 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు లేఖ రాశారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో జగన్ ను కోరారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఆంక్షలు విధించడం సరికాదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు అనుసరించిన విధానాలనే అనుసరించాలన్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తాము వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటామని టీడీపీ నేతలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలపై తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు తమ లేఖలో డిమాండ్ చేశారు.
Next Story

