Thu Jan 29 2026 17:33:27 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి హైకోర్టులో జగన్ సర్కార్ కు?
జగన్ ప్రభుత్వానికి వరసగా న్యాయస్థానాల్లో షాక్ లు తగులుతున్నాయి. మరోసారి జగన్ సర్కార్ కు హైకోర్టులో షాక్ తగిలింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ [more]
జగన్ ప్రభుత్వానికి వరసగా న్యాయస్థానాల్లో షాక్ లు తగులుతున్నాయి. మరోసారి జగన్ సర్కార్ కు హైకోర్టులో షాక్ తగిలింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ [more]

జగన్ ప్రభుత్వానికి వరసగా న్యాయస్థానాల్లో షాక్ లు తగులుతున్నాయి. మరోసారి జగన్ సర్కార్ కు హైకోర్టులో షాక్ తగిలింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్, చట్ట సవరణపై ఏపీ మైకోర్టు స్టే విధించింది. మూడు వారాల పాటు ఈ స్టే విధించింది. తమ గ్రామాల విలీనంపై హైకోర్టులో మొత్తం 46 పిటీషన్లు దాఖలయ్యాయి. దానివల్ల తమకు పన్నులు పెరగడమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. మూడు వారాల్లో తుది విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు తెలిపింది.
Next Story

