Wed Dec 17 2025 13:35:20 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని మోదీకి జగన్ మరో లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ఆయన ఈ లేఖ రాశారు. ఇరవై ఆక్సిజన్ ట్యాంకర్లను [more]
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ఆయన ఈ లేఖ రాశారు. ఇరవై ఆక్సిజన్ ట్యాంకర్లను [more]

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ఆయన ఈ లేఖ రాశారు. ఇరవై ఆక్సిజన్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలని జగన్ ప్రధానిని కోరారు. అలాగే కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని జగన్ ప్రధానికి రాసిన లేఖలో సూచించారు. కోవ్యాక్సిన్ దేశంలో అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయిందని జగన్ అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ సరఫరాను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని జగన్ ప్రధాని మోదీని కోరారు.
Next Story

