Wed Dec 17 2025 15:20:02 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ లాక్ డౌన్ అంటే తట్టుకోలేం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు. మళ్లీ లాక్ డౌన్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు. మళ్లీ లాక్ డౌన్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్షించారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు. మళ్లీ లాక్ డౌన్ వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా రాష్ట్రానికి 21 వేల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత లేకుండా చూడాలని కోరారు. వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.
Next Story

