Fri Dec 19 2025 16:18:12 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాల పంపిణీ గడువు పొడిగింపు
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ వరకూ పొడిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇళ్ల [more]
పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ వరకూ పొడిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇళ్ల [more]

పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ వరకూ పొడిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇంకా పూర్తికాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని పొడిగించాలని జగన్ నిర్ణయిం తీసుకున్నారు. ఇప్పటి వరకూ పట్టాల పంపిణీ పూర్తయిన వివరాలను జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పదిహేడు వేల కాలనీల్లో ఇప్పటి వరకూ 9,668 కాలనీల్లో మాత్రమే ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పూర్తయింది. మిగిలిన పట్టాల పంపిణీని పూర్తి చేసేందుకు ఈ నెల 20వ తేదీ వరకూ గడువు పెంచారు.
Next Story

