Mon Apr 29 2024 01:58:51 GMT+0000 (Coordinated Universal Time)
షాక్ తిన్న జగన్
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మరో యవకుడు ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ త్రినాథరావు అనే యువకుడు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సెల్ టవర్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదినేత వైఎస్ జగన్ స్పందించారు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తాను ఈ సంఘటనతో షాక్ తిన్నానన్నారు. త్రినాథరావు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ప్రకటించారు.
Next Story