Mon Mar 30 2026 18:50:02 GMT+0530 (India Standard Time)
జగన్ కేసు నుంచి తప్పుకున్న జస్టిస్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై దాఖలయిన పిటీషన్ నుంచి జస్టిస్ లలిత్ వైదొలిగారు. ప్రధాన న్యాయమూర్తికి [more]
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై దాఖలయిన పిటీషన్ నుంచి జస్టిస్ లలిత్ వైదొలిగారు. ప్రధాన న్యాయమూర్తికి [more]

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖపై దాఖలయిన పిటీషన్ నుంచి జస్టిస్ లలిత్ వైదొలిగారు. ప్రధాన న్యాయమూర్తికి జగన్ లేఖ రాయడంపై చర్యలు తీసుకోవాంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో ఉన్న జస్టిస్ లలిత్ విచారణ నుంచి తప్పుకున్నారు. ఈపిటీషన్ లు దాఖలు చేసిన వారికి తాను గతంలో న్యాయవాదిగా వ్యవహరించనందున తాను ఈ కేసు విచారణనుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ లలిత్ ప్రకటించారు. వేరే ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయాలని సూచించారు.
Next Story

