Wed Jan 21 2026 03:29:16 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి హైదరాబాద్ వెళ్లారు. స్పెషల్ ఫ్లయిట్ లో హైదరాబాద్ వెళ్లిన [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి హైదరాబాద్ వెళ్లారు. స్పెషల్ ఫ్లయిట్ లో హైదరాబాద్ వెళ్లిన [more]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మొదటిసారి హైదరాబాద్ వెళ్లారు. స్పెషల్ ఫ్లయిట్ లో హైదరాబాద్ వెళ్లిన ఆయన నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్ ను కలిశారు. అప్పటికే గవర్నర్ ను కలిసిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్.. జగన్ ను వైసీపీఎల్పీ నేతగా ఎన్నుకున్న తీర్మాణం పత్రాన్ని అందజేశారు. తర్వాత జగన్ గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరారు. గవర్నర్ తో ఆయన అరగంటకు పైగా సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
Next Story
