Wed May 01 2024 20:30:12 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ ఫిరాయింపులపై రాజ్యసభలో వైసీపీ నోటీసులు
పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ ఈరోజు కూడా ఆందోళనకు దిగింది. పోలవరం అంశంపై చర్చించాలని లోక్ సభలో వైసీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సవరించిన అంచనాలకు [more]
పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ ఈరోజు కూడా ఆందోళనకు దిగింది. పోలవరం అంశంపై చర్చించాలని లోక్ సభలో వైసీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సవరించిన అంచనాలకు [more]
పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ ఈరోజు కూడా ఆందోళనకు దిగింది. పోలవరం అంశంపై చర్చించాలని లోక్ సభలో వైసీపీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని నినాదాలు చేశారు. ఇక పార్టీ ఫిరాయింపులపై చర్చించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలంటూ లోక్ సభలో వైసీపీ ఎంపీలు నినాదాలు చేశారు. మరోవైపు పెగాసెస్ అంశంపై జ్యుడిషియల్ విచారణ జరపాలని, హోంమంత్రి రాజీనామా చేయాలని లోక్ సభలో కాంగ్రెస్, శివసేన, డీఎంకే ఎంపీలు పట్టుబట్టారు.
Next Story