Sun May 05 2024 02:50:30 GMT+0000 (Coordinated Universal Time)
ఆనాడే ఆత్మగౌరవం మంటగలిసింది
తెలుగువారి రాజధానిగా నిర్మిస్తున్న అమరావతి శిలాఫలకాన్ని ఇంగ్లీష్ లో వేసిన నాడే మన ఆత్మగౌరవం మంటగలిసిందని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఇవాళ ఆత్మగౌరవం అంటే అధికారంగా మారిపోయిందన్నారు. చంద్రబాబు నాయుడు - రాహుల్ గాంధీ భేటీపై ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. బస్సులో కాంగ్రెస్ వారు పక్కన కూర్చుంటే బస్సు దిగి వెళ్లిపోవాలని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు.
Next Story