Sun Feb 01 2026 21:01:06 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ఆస్తులను ప్రభుత్వ పరం చేయాలి
జప్తు చేసిన జగన్ ఆస్తులను ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సీబీఐ మొత్తం 47 పేజీలతో ఛార్జీషీట్లను పెట్టిందని, అందులో [more]
జప్తు చేసిన జగన్ ఆస్తులను ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సీబీఐ మొత్తం 47 పేజీలతో ఛార్జీషీట్లను పెట్టిందని, అందులో [more]

జప్తు చేసిన జగన్ ఆస్తులను ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సీబీఐ మొత్తం 47 పేజీలతో ఛార్జీషీట్లను పెట్టిందని, అందులో 18 పేజీల్లో ఆర్థిక నేరాలేనని ఆయన అన్నారు. జగన్ దోచుకున్న 43 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి జమ చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను యనమల రామకృష్ణుడు కోరారు. ఈ సొమ్మును ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. నీరవ్ మోదీ, మాల్యా, చోక్సీ ఆస్తులను ప్రభుత్వ పరం చేసినట్లుగానే జప్తు చేసిన జగన్ ఆస్తులను కూడా ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
Next Story

