Thu May 02 2024 08:12:22 GMT+0000 (Coordinated Universal Time)
దొంగల రాజ్యంలో దొంగలు కాక?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీని దొంగ ఓట్లు, నోట్ల రాజ్యంగా జగన్ మార్చారని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీని దొంగ ఓట్లు, నోట్ల రాజ్యంగా జగన్ మార్చారని [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీని దొంగ ఓట్లు, నోట్ల రాజ్యంగా జగన్ మార్చారని అన్నారు. దొంగల పాలనలో అంతా దొంగలమయం అయిందని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. నకిలీ ఓట్లను ఎవరు ముద్రించారో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. దొంగ ఓటర్లంతా వైసీపీ మంత్రులు పంపిన వాళ్లేనన్నారు. దొంగ ఓటర్లను పోలీసులు కేసులు పెట్టకుండా ఎందుకు వదిలేశారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఓటమి భయంతోనే దొంగ ఓట్లతో గట్టెక్కాలని వైసీపీ ఈ దారుణాలకు ఒడిగట్టిందని యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు.
Next Story