Thu Mar 19 2026 05:47:37 GMT+0530 (India Standard Time)
జగన్ కు అసెంబ్లీ అంటేనే భయం పట్టుకుంది
దేశంలో బడ్జెట్ సమావేశాలు జరపక పోవడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్ సమావేశాలను పెట్టకుండా ఆర్డినెన్స్ ను తేవడం [more]
దేశంలో బడ్జెట్ సమావేశాలు జరపక పోవడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్ సమావేశాలను పెట్టకుండా ఆర్డినెన్స్ ను తేవడం [more]

దేశంలో బడ్జెట్ సమావేశాలు జరపక పోవడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బడ్జెట్ సమావేశాలను పెట్టకుండా ఆర్డినెన్స్ ను తేవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలంటేనే జగన్ భయపడుతున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బడ్జెట్ కు సాకుగా చూపుతున్నారని యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆర్డినెన్స్ ఇవ్వడం పలాయనవాదం, దివాలాకోరు తనమని యనమల వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా జగన్ కు లెక్కలేదని యనమల అన్నారు.
Next Story

