Tue Mar 24 2026 02:43:48 GMT+0530 (India Standard Time)
అంతా నా ఇష్టం అంటే కుదరదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంతా తన ఇష్టం వచ్చిన రీతిలోనే పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంతా తన ఇష్టం వచ్చిన రీతిలోనే పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంతా తన ఇష్టం వచ్చిన రీతిలోనే పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీలన్నీ బోగన్ అని యనమల అభివర్ణించారు. కనీసం వాటిని అసెంబ్లీలో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని విమర్శించారు. విశాఖపట్నం అనేది సున్నితమైన జోన్ అన్న విషయాన్ని కూడా జగన్ విస్మరించారని చెప్పారు. విశాఖ, కర్నూలు ప్రజలు తమ ప్రాంతంలో రాజధానిని కోరుకోవడం లేదని తెలిపారు. విశాఖలో భూములను కబ్జా చేసేందుకే ఈ ప్రతిపాదనను జగన్ తీసుకువచ్చారన్నారు.
Next Story

