Thu Mar 19 2026 01:36:14 GMT+0530 (India Standard Time)
జగన్ తో ముద్రగడ నయా బేరం...!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పది వేల కోట్ల రూపాయలను కాపు కార్పొరేషన్ కు కేటాయిస్తామంటున్న జగన్ కు తామే ఇరవై వేల కోట్లు ఇస్తామని, ముఖ్యమంత్రి పదవి తమకు ఇవ్వాలని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పది వేల కోట్లతో జగన్ కాపులను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. కాపు రిజర్వేషన్లపై జగన్ రోజుకో మాట మారుస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే తుని రైలు దగ్దం ఘటన కేసులన్నీ ఎత్తివేస్తామని జగన్ చెప్పడం కాపులను బుట్టలో వేసుకోవడానికేనని ముద్రగడ అన్నారు. కాపుల రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అధినేత పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ముద్రగడ స్వాగతించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- east godavari district
- janasena party
- kapu reservations
- mudragada padmanabham
- nara chandrababu naidu
- pavan kalyan
- prajasankalpa padayathra
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కాపు రిజర్వేషన్లు
- జనసేన పార్టీ
- తూర్పు గోదావరి జిల్లా
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- ప్రజాసంకల్ప పాదయాత్ర
- ముద్రగడ పద్మనాభం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

