Sat Mar 21 2026 00:40:29 GMT+0530 (India Standard Time)
జగన్ యాత్రపై ఆది విశ్లేషణ ఇదీ...!

వైఎసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలకు, సభలకు వస్తున్న జనమంతా ఓట్లేసేవారుకాదని మంత్రి ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరుపున చిరంజీవి సభ పెడితే నలభై వేల మంది వచ్చారని, ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థికి 4100 ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అలాగే విశాఖలో విజయమ్మ ఎంపీగా నామినేషన్ వేయడానికి యాభే వేల మందితో వెళితే 91 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారన్నారు. బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు 500 మందితో నామినేషన్ వేసి విజయం సాధించిన విషయాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి గుర్తు చేశారు. జనం వచ్చినంత మాత్రాన సంబరపడిపోవద్దని, వారంతా ఓట్లేసే వాళ్లు కాదని ఆది ఎద్దేవా చేశారు.
- Tags
- adinarayanareddy
- andhra pradesh
- ap politics
- jammalamadugu
- janasena party
- kadapa district
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆదినారాయణరెడ్డి
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కడప జిల్లా
- జనసేన పార్టీ
- జమ్మలమడుగు
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story

