అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను....?
మహబూబ్నగర్ స్వాతి ఘటన మరువకముందే అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా హత్య చేయించిందో భార్య. ఎలాగైనా సరే కేసు నుంచి తప్పించుకోని ప్రియుడితో కలిసి ఉండాలనుకుంది. కానీ పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. హైదరాబాద్ సనత్నగర్లో జరిగిన దారుణ ఘటన పై ఓ రిపోర్ట్.
వయసు తేడా ఉండటంతో...
హైదరాబాద్ బోరబండలో నివాసముండే 46 ఏళ్ల మహ్మద్ ఖాజాకు 26 ఏళ్ల సలేహా బేగంతో రెండో వివాహం జరిగింది. అయితే వీరి మధ్య వయసు తేడా ఉండడంతో వైవాహిక జీవితం సరిగా నడవ లేదు. అదే సమయంలో సలేహా బేగంకు ఖురేషీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. వీరి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త మహ్మద్ ఖాజాను చంపితే పెళ్లి చేసుకోవచ్చని పథకం వేశారు. ఈ మేరకు ఖురేషీ మరో ముగ్గురు స్నేహితుల సహాయంతో ఖాజాకు మద్యం తాగించి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని స్థానికంగా ఉన్న రైలు పట్టాలపై పడేశారు.
పోలీసులు తమ దైన స్టయిల్ లో.....
ఇక భార్య సలేహా బేగం తన భర్త కన్పించడంలేదని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఖాజా మృతదేహాన్ని పట్టాలపై గుర్తించారు. అయితే మృతదేహంపై కొట్టిన ఆనవాళ్లు కన్పించడంతో కేసును సనత్నగర్ పోలీసులకు బదిలీ చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో పోలీసులకు కళ్లు చెదిరిపోయే విషయాలు తెలిశాయి. ఇదంతా భార్యే చేసి ఉండొచ్చని అనిమానించిన పోలీసులు తమదైన స్టయిల్లో సలేహా బేగాన్ని విచారించారు. దీంతో అసలు బండారం బయటపడింది.ప్రియుడు ఖురేషీతోనే భర్త ఖాజాను చంపినట్లు ఒప్పుకుంది సలేహా బేగం. ఖాజా భార్య సలేహా బేగంతో పాటు ప్రియుడు ఖురేషీ, ముజీబ్, అయాజ్, అక్బర్ బేగ్, జబీర్ తో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సనత్నగర్ పోలీసులు. కన్నతండ్రి మరణించి... తల్లి జైలు పాలవ్వడంతో వారి సంతానం దిక్కులేని వారుగా మిగిలిపోయారు.