Sat Jan 31 2026 16:23:18 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ కు అసెంబ్లీలోకి నో ఎంట్రీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ కు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ [more]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ కు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ [more]

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ కు మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ ను అసెంబ్లీలోకి రాకుండా తృణమూల్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. అసెంబ్లీ గేటుకు తాళం వేశారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ వెలుపల బైఠాయించడం సంచలనం కలిగించింది. గవర్నర్ నిరసనకు దిగడంతో చివరకు అసెంబ్లీ సిబ్బంది వచ్చి గేటు తాళాలు తీశారు. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ, గవర్నర్ లకు మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. కేంద్రానికి అనుకూలంగా గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ పై మమత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Next Story

