Sun May 05 2024 00:02:04 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పార్కింగ్ సిబ్బంది, విద్యార్థుల మధ్య తలెత్తిన ఘర్షణ దాడులకు దారితీసింది. కొందరు విద్యార్థులు పార్కింగ్ స్థలంలో కూర్చోవడంతో సిబ్బంది విద్యార్థులను దూషించారు. దీంతో మాటామాటా పెరిగింది. పార్కింగ్ సిబ్బంది కట్టెలు, కుర్చీలతో విద్యార్థులపై దాడి చేశారు. విద్యార్థులు కూడా ప్రతిదాడికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఆర్మీ అధికారులు కల్పించుకోవడంతో గొడవ సద్దమణిగింది. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థులు పెద్దఎత్తున సంఘటన స్థలం వద్దకు వచ్చి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు పార్కింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story