Fri Dec 05 2025 18:39:30 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు ఆ అర్హత లేదు… బీజేపీ ఫైర్
రామతీర్థం ను పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తన పరిపాలనలో 40 హిందూ దేవాలయాలను కూల్చివేశారని ఆయన గుర్తు [more]
రామతీర్థం ను పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తన పరిపాలనలో 40 హిందూ దేవాలయాలను కూల్చివేశారని ఆయన గుర్తు [more]

రామతీర్థం ను పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు తన పరిపాలనలో 40 హిందూ దేవాలయాలను కూల్చివేశారని ఆయన గుర్తు చేశారు. జగన్ హయాంలో ఇప్పటి వరకూ ఇరవై ఆలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రుల పరిపాలనలో హిందూ ఆలయాల ధ్వంసం జరుగుతూనే ఉందన్నారు. చంద్రబాబు రామతీర్థం పర్యటించడం విడ్డూరంగా ఉందని విష్ణువర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story

