Thu Dec 18 2025 13:36:36 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేపై దుష్ప్రచారం ఎందుకు?
దేశంలోనే రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో మొదటి వరుసలో ఉందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్థిక అభివృద్ధిలో కూడా మనం [more]
దేశంలోనే రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో మొదటి వరుసలో ఉందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్థిక అభివృద్ధిలో కూడా మనం [more]

దేశంలోనే రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో మొదటి వరుసలో ఉందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్థిక అభివృద్ధిలో కూడా మనం ముందు ఉన్నామని సాక్షాత్తు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. గడిచిన కరోనా కష్ట కాలంలోనూ కోత విధించిన వేతనాలు తిరిగి చెల్లించామని వినోద్ కుమార్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతన సవరణ కూడా చేశామన్నారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు జర్మనీలో ఉన్నా ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఆయనపై దుష్ప్రచారం చేయడం తగదని వినోద్ కుమార్ తెలిపారు.
Next Story

