Thu Jan 29 2026 00:13:44 GMT+0000 (Coordinated Universal Time)
వారికి ముక్కలు…వీరికి బొక్కలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నేత విజయశాంతి పైర్ అయ్యారు. కేసీఆర్ సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు మాత్రమే అభివృధ్దిని అందజేస్తున్నారన్నారు. ఆ రెండు నియోజకవర్గాలకు ముక్కలిచ్చి, మిగిలిన [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నేత విజయశాంతి పైర్ అయ్యారు. కేసీఆర్ సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు మాత్రమే అభివృధ్దిని అందజేస్తున్నారన్నారు. ఆ రెండు నియోజకవర్గాలకు ముక్కలిచ్చి, మిగిలిన [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నేత విజయశాంతి పైర్ అయ్యారు. కేసీఆర్ సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు మాత్రమే అభివృధ్దిని అందజేస్తున్నారన్నారు. ఆ రెండు నియోజకవర్గాలకు ముక్కలిచ్చి, మిగిలిన వాటికి బొక్కలు మిగులుస్తున్నారన్నారు. కుటుంబ సభ్యుల నియోజకవర్గాల్లో మాత్రం చెక్కులు ఇచ్చి, మిగిలిన నియోజకవర్గాల్లో మొక్కలు పంచుతున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. గతంలో హుజూర్ నగర్, నాగార్జున సాగర్ లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలకు ఎక్కడ నుంచి నిధులు తెస్తారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు.
Next Story

