Wed May 01 2024 13:24:19 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పుడు ఎవరు నమ్ముతారు బాబూ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని చంద్రబాబు [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకోని చంద్రబాబు పదవి పోగానే ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఈసడించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ పోయాక పార్టీ పదవులు ఇస్తే ఎవరు నమ్ముతారు బాబూ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. విస్తరిలో వడ్డించినప్పడే ఆకలి మంటను గుర్తించాలని, విస్తరిని ఎత్తివేసేటప్పుడు కాదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story