Thu Jan 29 2026 04:35:33 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ సహకరిస్తానని చెప్పారు
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం మంచి వాతావరణంలో జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని ఈ సందర్బంగా [more]
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం మంచి వాతావరణంలో జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని ఈ సందర్బంగా [more]

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం మంచి వాతావరణంలో జరిగిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని ఈ సందర్బంగా మోదీ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన తీరుకు విజయసాయిరెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 17 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని మోదీకి జగన్ సమర్పించినట్లు చెప్పారు. మోదీతో జగన్ భేటీ ఫలప్రదంగా ముగిసిందని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తెలిపారు.
Next Story

