Mon Mar 16 2026 07:54:01 GMT+0530 (India Standard Time)
ఆయన్ను టీడీపీ నేతలే రోడ్డున పడేశారు
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ కు యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వ్యాధి ఉందని మానసిక వైద్య నిపుణులు తేల్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయనను [more]
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ కు యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వ్యాధి ఉందని మానసిక వైద్య నిపుణులు తేల్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయనను [more]

విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ కు యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వ్యాధి ఉందని మానసిక వైద్య నిపుణులు తేల్చారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయనను టీడీపీ నేతలే రోడ్డున పడేశారని వ్యాఖ్యానించారు. డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ అయ్యేంత వరకూ టీడీపీ నేతలు రెచ్చగొట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండబట్టే డాక్టర్ సుధాకర్ ను మెంటల్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని హిత వచనాలు చెబుతున్నారని, ఆయన ఇచ్చిన విరాళంతో ప్రజలకు తలా ఒక్క కోడిగుడ్డుకూడా రాదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story

