Mon Dec 08 2025 13:07:20 GMT+0000 (Coordinated Universal Time)
బానిసలతో కాదు.. బాబూ నోరు విప్పు
పోతిరెడ్డిపాడు పై చంద్రబాబు తన అభిప్రాయాన్ని చెప్పాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇతర పార్టీల్లోకి పంపిన బానిసలతో చంద్రబాబు మాట్లాడిస్తున్నారన్నారు. వారు ఎంత చించుకున్నా [more]
పోతిరెడ్డిపాడు పై చంద్రబాబు తన అభిప్రాయాన్ని చెప్పాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇతర పార్టీల్లోకి పంపిన బానిసలతో చంద్రబాబు మాట్లాడిస్తున్నారన్నారు. వారు ఎంత చించుకున్నా [more]

పోతిరెడ్డిపాడు పై చంద్రబాబు తన అభిప్రాయాన్ని చెప్పాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇతర పార్టీల్లోకి పంపిన బానిసలతో చంద్రబాబు మాట్లాడిస్తున్నారన్నారు. వారు ఎంత చించుకున్నా ఏమీ కాదని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీ ఒక్క చుక్క నీటిని కూడా నీటి కేటాయింపులకు విరుద్ధంగా తీసుకోదని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం పోతిరెడ్డిపాడుపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ పారిపోయి యాభై రోజులు దాటిందన్నారు. కష్ట సమయంలో ఏపీ ప్రజలను వదలి వెళ్లారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శలు చేశారు.
Next Story

