Mon Dec 08 2025 14:01:54 GMT+0000 (Coordinated Universal Time)
బాబూ రెండు రోజుల నుంచి ఈ మారాం ఏమిటి?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో ఆయన విమర్శలు చేశారు. రెండు రోజుల [more]
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో ఆయన విమర్శలు చేశారు. రెండు రోజుల [more]

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై విమర్శలు చేశారు. ట్విట్టర్ లో ఆయన విమర్శలు చేశారు. రెండు రోజుల నుంచి విమానంలో విశాఖ వెళ్తానని చంద్రబాబు మారాం చేస్తున్నారన్నారు. తండ్రీ కొడుకులిద్దరూ హైదరాబాద్ లో ఇరుక్కుపోయారన్నారు. కానీ విమానంలోనే ఎందుకు బాబూ? కారులో రావచ్చు కదా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. తండ్రీ కొడుకులిద్దరినీ బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించి ఏపీకి పంపండి అని ఎద్దేవా చేశారు. కారులో ఆరేడు గంటల్లో విశాఖకు చేరుకోవచ్చని, కానీ విమానమే కావాలని చంద్రబాబు మారాం చేస్తున్నారని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.
Next Story

