Sun Mar 15 2026 13:25:37 GMT+0530 (India Standard Time)
ఆయన చెప్పేదొకటి.. చేసేదొకటి
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ పైకి చెప్పేదొకటి చేసేదొకటి అని ఆయన దుయ్యబట్టారు. [more]
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ పైకి చెప్పేదొకటి చేసేదొకటి అని ఆయన దుయ్యబట్టారు. [more]

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ పైకి చెప్పేదొకటి చేసేదొకటి అని ఆయన దుయ్యబట్టారు. సింహాచలం భూముల్లో అవకతవకలు జరిగాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఇందులో అశోక్ గజపతిరాజు పాత్ర ఉందన్నారు. అశోక్ గజపతిరాజు ఆలయ ధర్మకర్తా? అధర్మకర్తా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అశోక్ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఆలయాల్లో స్కాములు జిరిగాయన్నారు. అన్నింటిని వెలుగులోకి తెచ్చి ఆలయ భూములను కాపాడతామని విజయసాయిరెడ్డి అన్నారు. ఆలయ భూములు పరాధీనం పాలవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Next Story

