Mon Mar 16 2026 13:09:06 GMT+0530 (India Standard Time)
బాబుకు ఇష్టం లేకనే
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. పల్నాడులో రచ్చ రచ్చ చేయడానికి కారణం ఇదేనన్నారు. ప్రశాంతంగా [more]
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. పల్నాడులో రచ్చ రచ్చ చేయడానికి కారణం ఇదేనన్నారు. ప్రశాంతంగా [more]

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్ర చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. పల్నాడులో రచ్చ రచ్చ చేయడానికి కారణం ఇదేనన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించి అరాచకాలను చేయడమే టీడీపీ లక్ష్యమన్నారు. అందుకే ఏమీ లేకపోయినా చలో ఆత్మకూరుకు చంద్రబాబు పిలుపునిచ్చారన్నారు. ఏపీ ప్రశాతంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు విజయసాయిరెడ్డి. యరపతినేని, కోడెల దూడలను రక్షించుకోవడానికే ఈ ప్రయత్నమన్నారు. పల్నాడులో గత ఐదేళ్ల నుంచి రౌడీ రాజ్యం ఏలిందన్నారు.
Next Story

