Thu Mar 26 2026 18:23:17 GMT+0530 (India Standard Time)
ఎక్కడో చెప్పిన విజయసాయిరెడ్డి
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అది కూడా భీమిలీలోనే ఉంటుందని విజయసాయి రెడ్డి తగరపు వలసలో జరిగిన ఒక కార్యక్రమంలో [more]
విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అది కూడా భీమిలీలోనే ఉంటుందని విజయసాయి రెడ్డి తగరపు వలసలో జరిగిన ఒక కార్యక్రమంలో [more]

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అది కూడా భీమిలీలోనే ఉంటుందని విజయసాయి రెడ్డి తగరపు వలసలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. భీమిలీ ప్రాంతంలోనే సచివాలయం ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడంతోనే సాధ్యమవుతుందన్నారు. జగన్ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. భీమిలీ మరో మహా నగరంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు, అధికారులు, సిబ్బంది అంతా ఇక విశాఖలోనే ఉంటారని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story

