Mon Feb 09 2026 10:17:48 GMT+0530 (India Standard Time)
వారిద్దరే కాదు వందమంది
తెలుగుదేశం పార్టీలో కోడెల, యరపతినేని వంటి దోపిడీదారులు వంద మంది ఉన్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. త్వరలోనే వీరు కూడా బోనులో నిలబడక తప్పదని ఆయన [more]
తెలుగుదేశం పార్టీలో కోడెల, యరపతినేని వంటి దోపిడీదారులు వంద మంది ఉన్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. త్వరలోనే వీరు కూడా బోనులో నిలబడక తప్పదని ఆయన [more]

తెలుగుదేశం పార్టీలో కోడెల, యరపతినేని వంటి దోపిడీదారులు వంద మంది ఉన్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. త్వరలోనే వీరు కూడా బోనులో నిలబడక తప్పదని ఆయన ట్వీట్ చేశారు. రాజధానిపై ఇంత రగడ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు కోటరీలో నిన్న మొన్నటి దాకా ఉన్న నేతలు ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారో అందరికీ తెలుసునని పరోక్షంగా సుజనా చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో ప్రజారాజధాని నిర్మించాలని డిమాండ్ చేసిన వ్యక్తులే నేడు అదే రాజధాని కావాలంటూ ఆందోళన చేస్తామంటున్నారని పవన్ కల్యాణ్ పై విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.
Next Story

