Fri Dec 05 2025 20:12:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో క్రైం రేటు తగ్గింది
ఆంధ్రప్రదేశ్ లో క్రైం రేటు తగ్గిందని ఏపీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మహిళ సంక్షేమ [more]
ఆంధ్రప్రదేశ్ లో క్రైం రేటు తగ్గిందని ఏపీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మహిళ సంక్షేమ [more]

ఆంధ్రప్రదేశ్ లో క్రైం రేటు తగ్గిందని ఏపీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మహిళ సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చారన్నారు. మహిళలకు రాజకీయాల్లో యాభై శాతం రిజర్వేషన్లను అమలు చేస్తుంది జగన్ మాత్రమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే నాలుగు శాతం క్రైం రేటు తగ్గిందని ఆమె చెప్పారు. టీడీపీ, లోకేష్ లు అనవసరంగా రాద్ధాతం చేస్తున్నారని, ఎక్కడ ఏ సంఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
Next Story

