Mon Feb 02 2026 08:59:07 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : జగన్ తో వంశీ భేటీ
కాసేపట్లో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీ భేటీ కాబోతున్నారు. వల్లభనేని వంశీ జగన్ తో భేటీ [more]
కాసేపట్లో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీ భేటీ కాబోతున్నారు. వల్లభనేని వంశీ జగన్ తో భేటీ [more]

కాసేపట్లో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీ భేటీ కాబోతున్నారు. వల్లభనేని వంశీ జగన్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వల్లభనేని వంశీపై ఇటీవల నకిలీ, ఫోర్జరీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దీనిపై వల్లభనేని వంశీ తాజాగా సుజనా చౌదరిని కూడా కలిశారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, దీనిపై తాను కేంద్రమంత్రులకు, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పారు. కానీ ఇలా చెప్పిన గంటలు గడవక ముందే జగన్ ను వల్లభనేని వంశీ కలవబోతుండటం రాజకీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది.
Next Story

