Fri Dec 05 2025 17:39:22 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా సమయంలో ఈ ఎన్నికలు అవసరమా?
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలు అవసరమా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కంపు కంటే ముందు [more]
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలు అవసరమా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కంపు కంటే ముందు [more]

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఎన్నికలు అవసరమా అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గం ఓట్ల లెక్కంపు కంటే ముందు తెలివిగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను పెట్టించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తున్నారన్నారు. రాజకీయాల కోసం ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నిచారు. ఎన్నికల విషయంలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోకపోవడం దురదృష్టకరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story

