Fri Dec 05 2025 18:21:34 GMT+0000 (Coordinated Universal Time)
Undavalli : జగన్ సర్కార్ ను హెచ్చరించిన ఉండవల్లి
వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆరు [more]
వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆరు [more]

వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆరు లక్షల కోట్లను అప్పులు చేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇలా అప్పులు చేసుకుంటూ పోతే రాష్ట్రం ఏమైపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేయడమేంటని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారులు ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్ లో ఏపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనక తప్పదని ఆయన హెచ్చరించారు.
Next Story

