Sat May 04 2024 19:47:52 GMT+0000 (Coordinated Universal Time)
ఉండవల్లి పెట్టారు మళ్లీ మెలిక
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర విభజనపై చర్చకు నోటీసులు ఇవ్వాలని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. 1972లో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయంపై 1978లో పార్లమెంటులో చర్చ జరిగిన సంగతిని ఈ సందర్భంగా ఉండవల్లి చంద్రబాబుకు గుర్తు చేశారు. గత పార్లమెంటులో జరిగిన విభజనపైన కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చించవచ్చునన్నారు. విభజన జరిగిందని చెబుతున్నా పార్లమెంటు ప్రొసీడింగ్స్ లో ఆ విషయమే లేదని తెలిపారు. కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యులు కాదు కాబట్టి నోటీసు ఇవ్వవచ్చన్నారు. అలాగే ఏపీ విభజనకు వ్యతిరేకంగా తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషప్ పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు తాను టీడీపీ నేతల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
Next Story