Tue Apr 30 2024 10:59:09 GMT+0000 (Coordinated Universal Time)
దోషం పేరుతో కోడలిపై.....?
మేనకోడలి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ మేనమామ ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కోడలిపై కన్నేసిన నీచుడు ఆమె జాతకంలో దోషం ఉందని నమ్మబలికాడు. దీంతో ఆమె తండ్రి చనిపోతాడని, వివాహం కూడా కాదని భయపెట్టాడు. దోషం తీరాలంటే తాను చెప్పినట్లు చేయాలని... నాలుగేళ్లుగా ఆమెపై లెక్కలేనన్ని సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఘాతుకం జరిగింది. కొన్ని రోజులకు యువతికి వివాహం జరిగింది. అయినా తీరు మార్చుకోని ఆ నీచుడు మళ్లీ కోడలిని వేదిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వాడిని అరెస్టు చేశారు. యువతికి సైతం మూఢనమ్మకాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు.
Next Story