Thu Jan 29 2026 16:58:28 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్ధవ్ రెస్పాన్స్ ఇదే
మహారాష్ట్రలో బీజేపీ కుట్ర బయటపడిందని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఆయన శరద్ పవార్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్స్ [more]
మహారాష్ట్రలో బీజేపీ కుట్ర బయటపడిందని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఆయన శరద్ పవార్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్స్ [more]

మహారాష్ట్రలో బీజేపీ కుట్ర బయటపడిందని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే అన్నారు. ఆయన శరద్ పవార్ తో కలసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై బీజేపీ సర్జికల్ స్ట్రయిక్స్ చేసిందన్నారు. బీజేపీ అన్ని నిబంధలను తుంగలో తొక్కిందని ఉద్ధవ్ థాక్రే తీవ్రస్థాయిలో విమర్శించారు. పైగా ప్రజాతీర్పును అవమానించినట్లు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హర్యానా తరహా రాజకీయాలు మహారాష్ట్రలో చేయాలని చూసిందన్నారు. ఎన్సీపీ నుంచి ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం మాట్లాడారు. శివసేన, ఎన్సీపీ ఉమ్మడి మీడియా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది.
Next Story

