Thu Dec 18 2025 18:01:11 GMT+0000 (Coordinated Universal Time)
నా మౌనాన్ని చేతకాని తనంగా చూడొద్దు
తన మౌనాన్ని బలహీనంగా చూడవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా కరోనాపైనే ఉందన్నారు. మహారాష్ఠ్రను అపఖ్యాతి చేసే కుట్ర జరుగుతుందని ఉద్ధవ్ [more]
తన మౌనాన్ని బలహీనంగా చూడవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా కరోనాపైనే ఉందన్నారు. మహారాష్ఠ్రను అపఖ్యాతి చేసే కుట్ర జరుగుతుందని ఉద్ధవ్ [more]

తన మౌనాన్ని బలహీనంగా చూడవద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. ప్రస్తుతం తన దృష్టంతా కరోనాపైనే ఉందన్నారు. మహారాష్ఠ్రను అపఖ్యాతి చేసే కుట్ర జరుగుతుందని ఉద్ధవ్ థాక్రే చెప్పారు. రాజకీయాలపై తాను ఇప్పుడు మాట్లాడబోనని తెలిపారు. అలాగని చేతకాని తనంగా చూడవద్దని ఉద్ధవ్ థాక్రే పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని చెప్పారు. కాగా కంగనా రనౌత్ నేడు గవర్నర్ ను కలసి తన కార్యాలయాన్ని కూల్చివేయడంపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముంబయిని అపఖ్యాతి చేసే కుట్ర జరుగుతుందని ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు.
Next Story

