Wed Mar 18 2026 04:37:31 GMT+0530 (India Standard Time)
టీడీపీ ఈవో బదిలీ.. బ్రహ్మోత్సవాల తర్వాత వేటు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. [more]
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. [more]

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్ గత చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. జగన్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నా ఆయననే కొనసాగించారు. తాజాగా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన వెంటనే ఈవో పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం అదనపు ఈవోగా ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
Next Story

