Tue Mar 17 2026 12:09:23 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వీరే
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇద్దరి పేర్లను ఖరారు చేశారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు మరోసారి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే [more]
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇద్దరి పేర్లను ఖరారు చేశారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు మరోసారి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే [more]

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇద్దరి పేర్లను ఖరారు చేశారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు మరోసారి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మరో స్థానానికి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని ఎంపిక చేశారు. కె.కేశవరావుకు పార్టీలో ఉన్న సీనియారిటీని గుర్తించి ఆయనకు మరోసారి అవకాశమివ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే గత శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన సురేష్ రెడ్డికి ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ పదవిని ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేష్ రెడ్డికి సౌమ్యుడిగా పేరుంది. రేపు ఉదయం 11 గంటలకు ఇద్దరు నామినేషన్ వేస్తారు.
Next Story

