Thu Dec 18 2025 07:32:06 GMT+0000 (Coordinated Universal Time)
సస్పెన్షన్ కు గురైన ముగ్గురూ
శాసనసభ నుంచి సస్పెండ్ కు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ ను కలిశారు. టీడీపీ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల [more]
శాసనసభ నుంచి సస్పెండ్ కు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ ను కలిశారు. టీడీపీ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల [more]

శాసనసభ నుంచి సస్పెండ్ కు గురైన ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ ను కలిశారు. టీడీపీ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులు తమపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. టీడీపీ సభ్యుల ప్రతిపాదనను బుగ్గన ముందు ఉంచారు. అయితే వైఎస్ జగన్ తో మాట్లాడిన తర్వాత టీడీపీ సభ్యుల సస్పెన్షన్ విషయం మాట్లాడదామని బుగ్గన డిప్యూటీ స్పీకర్ కు తెలిపారు. పరిస్థితి చూస్తుంటే టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఒకరోజుకే పరిమితం చేసే అవకాశాలున్నాయి.
Next Story

