Fri Dec 05 2025 17:37:24 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్సీకి కరోనా
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయన [more]
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయన [more]

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ గా తేలడంతో తన స్వగ్రామమైన వెంకటాయపాలెంలో ఆయన హోం ఐసొలేషన్ కు వెళ్లారు. గత కొన్ని రోజులుగా తోట త్రిమూర్తులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో తనతో వారం రోజులుగా కాంట్రాక్టు అయిన వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తోట త్రిమూర్తులు కోరారు.
Next Story

