Thu Jan 29 2026 21:26:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: సచివాలయ భవనాల కూల్చివేతకు మళ్లీ బ్రేక్
సచివాలయం భవనాల కూల్చివేత పనులపై ఆంక్షలను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకూ సచివాలయం లో కూల్చివేత పనులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. [more]
సచివాలయం భవనాల కూల్చివేత పనులపై ఆంక్షలను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకూ సచివాలయం లో కూల్చివేత పనులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. [more]

సచివాలయం భవనాల కూల్చివేత పనులపై ఆంక్షలను హైకోర్టు మళ్లీ పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకూ సచివాలయం లో కూల్చివేత పనులను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్ లో తమకు సమర్పించాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ను కోరింది. ఈరోజు సాయంత్రం లోగా సమర్పిస్తామని ఏజీ చెప్పారు. సచివాలయం కూల్చివేత పనులను నిలిపేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం కూల్చివేత పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులకు అనుమతించాలని కోరింది. తదుపరి విచారణను ఈ నెల 15వతేదీకి వాయిదా వేసింది.
Next Story

