Thu Jan 29 2026 20:27:02 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ విషయంలో నేడు హైకోర్టులో?
ఆంధ్రప్రదేశ్ లో నేడు హైకోర్టు చెప్పే తీర్పు పై ఉత్కంఠ నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై [more]
ఆంధ్రప్రదేశ్ లో నేడు హైకోర్టు చెప్పే తీర్పు పై ఉత్కంఠ నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై [more]

ఆంధ్రప్రదేశ్ లో నేడు హైకోర్టు చెప్పే తీర్పు పై ఉత్కంఠ నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు రాజ్యాంగ విరుద్ధమని ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలయింది. దీనిని స్వీకరించిన హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే కొత్త ఎన్నికల అధికారిగా కనగరాజ్ నియమితులయ్యారు. ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం జీవోలను తెచ్చింది. దీంతో హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story

