Thu Mar 19 2026 01:20:24 GMT+0530 (India Standard Time)
కిడ్నాప్ అయిన జషిత్ క్షేమం
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడి కిడ్నాప్ ఉదంతంలో 60 గంటల ఉత్కంఠానికి తెర పడింది. జషిత్ ను ఉదయం 6గంటలకు కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద తెల్లవారుజామున దుండగులు [more]
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడి కిడ్నాప్ ఉదంతంలో 60 గంటల ఉత్కంఠానికి తెర పడింది. జషిత్ ను ఉదయం 6గంటలకు కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద తెల్లవారుజామున దుండగులు [more]

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడి కిడ్నాప్ ఉదంతంలో 60 గంటల ఉత్కంఠానికి తెర పడింది. జషిత్ ను ఉదయం 6గంటలకు కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద తెల్లవారుజామున దుండగులు వదిలి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాలుగేళ్ల బాలుడు జషిత్ క్షేమంగా ఉన్నాడు. కిడ్నాపర్ల బారి నుంచి క్షేమంగా బయటపడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు వద్ద ఇవాళ తెల్లవారుజామున కిడ్నాపర్లు బాలుడిని వదలి వెళ్లిపోయారు. రోడ్డు పక్కన కొంత మంది కూలీలకు ఓ బాలుడు ఏడుస్తూ కనిపించాడు. దగ్గరకు వెళ్లి చూడగా.. జషిత్ అని నిర్ధారణకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు
Next Story

