Tue Jan 20 2026 11:20:15 GMT+0000 (Coordinated Universal Time)
ఆమంచి వర్గీయులపై మత్స్యకారుల దాడి
చీరాల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ నెలకొంది. రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య విభేదాలు తలెత్తాయి. చేపల వేటలో తలెత్తిన విభేదాలు ఘర్షణకు దారితీశాయి. ఓడరేవు, కటారివారిపాలెం గ్రామాల [more]
చీరాల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ నెలకొంది. రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య విభేదాలు తలెత్తాయి. చేపల వేటలో తలెత్తిన విభేదాలు ఘర్షణకు దారితీశాయి. ఓడరేవు, కటారివారిపాలెం గ్రామాల [more]

చీరాల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ నెలకొంది. రెండు గ్రామాల మత్స్యకారుల మధ్య విభేదాలు తలెత్తాయి. చేపల వేటలో తలెత్తిన విభేదాలు ఘర్షణకు దారితీశాయి. ఓడరేవు, కటారివారిపాలెం గ్రామాల మధ్య విభేదాలు తలెత్తాయి. మత్స్య కారులు చీరాలలో ఆందోళనకు దిగారు. మత్స్యకారులను పరామర్శించేందుకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఓడరేవుకు చేరుకున్నారు. ఆయన వెంట కరణం బలరాం కూడా ఉన్నారు. ఇదే సమయంలో మత్స్యకారులు అక్కడకు వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ ను మత్స్యకారులు నిలదీశారు. ఆమంచి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆమంచి వర్గీయులపై దాడి చేశారు. ఎస్ఐ సుధాకర్ వాహనంపై కూడా మత్స్యకారులు దాడి చేశారు.
Next Story

